హైదరాబాదులో ఏర్పాటుచేసిన పద్మశాలి శంఖారావం కార్యక్రమానికి శంకరపట్నం మండలం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున పద్మశాలీలు హైదరాబాద్ కు తరలి వెళ్లారు.
ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 30లక్షల పైచిలుకు జనాభా గల పద్మశాలీలు అన్నిరంగాలలో అణిచివేయబడుతున్నారని పద్మశాలీలకు రాజకీయంగా అవకాశాలు ఏ పార్టీ ఇవ్వడం లేదని, ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 15 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలను అన్ని పార్టీలు కేటాయించడానికి ఒత్తిడి తెస్తామని, ఐక్యతతో ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో హక్కులు వాటాలు సాధిస్తామని ఈ రోజు జరుగుతున్న సరూర్ నగర్ సభను లక్షలాదిగా తరలి వెళ్లి విజయవంతం చేస్తున్నామని అన్నారు.