Breaking News

ప్రగతి యాత్ర’లో భాగంగా 103వ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటన.

83 Views

‘ప్రగతి యాత్ర’లో భాగంగా 103వ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటన.

*దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 08. డి.పోచంపల్లి, సాయి పూజ కాలనీ లో పాదయాత్ర…*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 08. డి.పోచంపల్లి, సాయి పూజ కాలనీ లో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా 103వ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు స్థానిక కౌన్సిలర్ సాయి యాదవ్ గారితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాగా తమ బస్తీల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలి ఉన్న చిన్నపాటి పనులను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా. అనంతరం ఎమ్మెల్యే గారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు…
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవి యాదవ్, పాక్స్ డైరెక్టర్ వెంకటేష్ యాదవ్, , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజశేఖర్ యాదవ్, కొత్తగూడెం శ్రీశైలం, మహమ్మద్ హాజీ భాయ్, బస్తి ప్రెసిడెంట్ సర్వర్, మైనారిటీ ప్రెసిడెంట్ కాంతావ్, జహాంగీర్, మౌల, ఖయూమ్, ఇమ్రాన్, సులేమాన్, మహమ్మద్ ముస్తఫా, అజ్మద్, కృష్ణ, పాశా, రషీద్ భాయ్, మీర్జా, లింగం గౌడ్, కిరణ్ స్వామి, మధు, నయీమ్, శేఖర్, హఫీజ్, వసీం, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *