*ధూప దీప వేతనం రూ.10,000*
సీఎం కేసీఆర్ ఇచ్చిన మరో హామీ కొద్దిరోజుల్లోనే అమలుకు నోచుకున్నది. మే 31న గోపన్పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ధూప దీప నైవేద్యం పథకం అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్టు ప్రకటించారు.
సీఎం ఆదేశాల ప్రకారం ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్ ప్రతిపాదనలను పంపారు. ఆ ప్రతిపాదనలకు తాజాగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
6,541 మంది అర్చకులకు లబ్ధి
మూడు నెలల్లోనే అమలవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరో హామీ
అర్చక సమాఖ్య హర్షం.. క్షీరాభిషేకం
నేడు కేసీఆర్ పేరిట గుడుల్లో పూజలు
సీఎం కేసీఆర్ ఇచ్చిన మరో హామీ కొద్దిరోజుల్లోనే అమలుకు నోచుకున్నది. మే 31న గోపన్పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ధూప దీప నైవేద్యం పథకం అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్టు ప్రకటించారు. సీఎం ఆదేశాల ప్రకారం ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్ ప్రతిపాదనలను పంపారు. ఆ ప్రతిపాదనలకు తాజాగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రూ.4,000 ధూప దీప నైవేద్యానికి, రూ.6,000 అర్చకుల వేతనం అందజేస్తారు.





