శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ వెస్ట్లో నూతనంగా నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం అదృష్టకరం. ప్రజలపై స్వామివారి చల్లని చూపు ఉండాలని ప్రార్ధించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అద్యక్షులు, డివిజన్ల అధ్యక్షులు, స్థానిక నాయకులు ఆలయ కమిటీ సభ్యులు కొనసాగుతున్నారు.





