*శ్రావణమాస బసవజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ….*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగ్ బస్తీ లింగాయత్ భవనంలో శ్రావణమాస బసవజ్యోతి కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి.నంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్నింటిలో వెనుకబడిన వీరశైవ లింగాయత్ ల సంక్షేమం, అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వీరశైవ లింగాయత్ లు అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతున్నారంటే సీఎం కేసీఆర్ గారి చలవేనన్నారు. నియోజకవర్గంలోని వీరశైవ లింగాయత్ లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా తన వంతు కృషి తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ స్వామి, హిమాలయ పీఠాధిపతి, తెలంగాణ లింగాయత్ ప్రెసిడెంట్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అద్యేక్షులు రు అశోక్, సీనియర్ నాయకులు సయీద్ రషీద్, సంజు, బస్వరాజ్, రణ్వీర్, ధర్మేందర్, రమేష్, వీరయ్య స్వామి, కపిల్, హనుమంతు, శివరాజ్, ఉన్నారు.





