కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం స్వర్ణకార సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి మాచారెడ్డి మండల ఎన్నికలలో
అధ్యక్షునిగా చేపూరి శ్రీనివాస్ చారి
కార్యదర్శిగా. కత్రోజు వేణుగోపాల్ చారి కోశాధికారిగా. మారోజు నరసింహ చారి, ఉపాధ్యక్షుడిగా. చెన్నోజు లింగమా చారి,చేపూరి శ్రీనివాస్ చారి,ఉప కార్యదర్శిగా పిన్నోజి గంగాధర్ చారి, ఎన్నుకున్నారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకట స్వామి విచ్చేసి ఆయన మాట్లాడుతూ స్వర్ణకారులందరూ ఐక్యంగా ఉండాలని ప్రతి గ్రామంలో స్వర్ణకార సంఘాల ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లో ఎక్కువ శాతం స్వర్ణకారులు లేకుంటే మండలంలోని స్వర్ణకార సంఘం ఏర్పాటు చేసి స్వర్ణకార సమస్యలను పరిష్కరించుకోవాలని కులంతోనే బలమని ప్రతి స్వర్ణకారుడు మండల సంఘంలో చేరి స్వర్ణకారుల ఉనికిని చాటి అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు జిల్లా అధికారులకు జిల్లాలో ఉండే నాయకులకు మండల ప్రజా ప్రతినిధులకు స్వర్ణకార సంఘం ఒకటి ఉందని తెలియజేయాలని అన్నారు హక్కుల ను త్వరతగతిన సాధించాలంటే గ్రామాల్లో మండలలో స్వర్ణకార సంఘాలు ఏర్పాటు చేసి మన హక్కుల సాధనకై పోరాడుదాం అని రాష్ట్ర స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకట స్వామి అన్నారు ఈ కార్యక్రమంలో మాచారెడ్డి స్వర్ణకార సభ్యులు తదితరులు పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకున్న వారికి శాలువాలు కప్పి సన్మానం చేసి ఎన్నికలు సజావుగా నిర్వహించుకున్నారు.





