Breaking News

మద్యం మత్తులో ముగ్గురిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు*  వనపర్తి జిల్లా: ఆగస్టు 23

119 Views

*మద్యం మత్తులో ముగ్గురిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు*

వనపర్తి జిల్లా: ఆగస్టు 23

మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు నడిపి రోడ్డుపై నిలుచున్న ముగ్గురు వ్యక్తులను ఢీ కొట్టిన సంఘటన కొత్తకోట మండలలోని కానాయపల్లి గ్రామ స్టేజి దగ్గర చోటు చేసుకుంది.

ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆత్మకూరు నుండి వనపర్తి వెళుతున్న ఆర్టీసీ బస్సు (టిఎస్ 32 టి 5194 ) డ్రైవర్ తాగిన మత్తులో బస్సు నడుపుకుంటూ వచ్చి బుగ్గపల్లి తండాకు చెందిన సేవ్య నాయక్, మల్లేష్ , అనిల్ రోడ్డు పక్కన మాట్లాడుకుంటుండగా ఆర్టీసీ డ్రైవర్ బస్సుతో వారిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనలో సేవ్యా నాయక్ కుమారుడైన మల్లేష్ నాయక్‌కు కాలు విరిగిపోయిందని స్థానికులు తెలిపారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పారిపోయినట్లు స్థానికులు తెలిపారు.

క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు….

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *