-సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన పొన్నం అనిల్ గౌడ్
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికసాయం అందిస్తున్నారని మన్నెంపల్లి ఉప సర్పంచ్ పొన్నం అనిల్గౌడ్ అన్నారు. గ్రామానికి చెందిన అనగోని లక్ష్మణ్ 40,000 , అక్కేపల్లి అనీల్ 34,500,నాంపల్లిపర్షరాములు 20,000, కొలిపాక లక్ష్మీ 18,500, కొలిపాక మంజుల 18,000, నాంపల్లి లక్ష్మీ 14,000 చొప్పున సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. వాటిని ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తమకు ఆర్థికసాయం మంజూరు అయ్యేలా కృషి చేసిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీటీసీ శైలజ- జితేందర్ రెడ్డి, ఎంపీపీ కేతిరెడ్డి వనిత- దేవేందర్ రెడ్డీ,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు నార్ల అశోక్, నాంపల్లి శంకరయ్య, కొలిపాక రాజమౌలి,గుంటీ కిష్టయ్య, బీనపళ్లి శ్రీనివాస్,గుర్రాల వెంకన్న, బౌత్ గంగాధర్,ఎండి మహమ్మద్, పర్నంది స్వామీ,నాంపెళ్ళి పర్శారములు,కామేర సంపత్, ఎడ్ల తిరుపతి రెడ్డీ,దరిపెల్లి వేణు కుమార్,బినపెళ్లి సంపత్, పోతుగంటి సంపత్,రాదరపు శ్రీనివాస్, అనగొని సంపత్,కందుకూరి శ్రీనివాస్,బోయిని తిరుపతి, పర్నంది జగదీశ్, నాంపల్లి జగన్, గుంటీ నవీన్, తదితరులు పాల్గొన్నారు.





