Breaking News

కరీంనగర్‌ జిల్లాలో పిడుగు పాటుకు ఇల్లు ధ్వంసం

208 Views

కరీంనగర్‌ జిల్లా :జులై 25జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, భారీ వర్షాలకు గన్నేరువరం మండల కేంద్రంలో పిడుగు పడి ఓ ఇల్లు ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే..కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కొత్త స్వప్న- శ్రీనివాస్ ఇంటిపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగు పడి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.ఒక్కసారిగా భారీ శబ్దంతో రావడంతో కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రంతా భయంతో నిద్రలేక జాగారం చేశారు. ఇంట్లో వంట సామగ్రి పూర్తిగా ధ్వంసమైంది. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో ఇల్లుతో పాటు సమాను అంతా ధ్వంసమైందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *