రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రజిత సాయి చంద్ అభినందనలు తెలిపిన బి ఆర్ ఎస్ నాయకులు
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద రజని సాయిచంద్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా వారిని కొండపాక వైస్ ఎంపీపీ దేవి రవీందర్ ,సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బి ఆర్ ఎస్ పార్టీ బిసి సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ శుక్రవారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతారని అలాగే సాయిచంద్ ఉద్యమంలో తన పాటలతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున సాగే విధంగా పాడుతూ పార్టీలో జరిగే ప్రతీ కార్యక్రమంలో ముందుండి కార్యక్రమాన్ని నడిపించే నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడని గుర్తు చేశారు. సాయిచంద్ మరణం పార్టీకి తీరని లోటని అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకున్న అన్నాడు.ఈ కార్యక్రమంలో మర్కుక్ సర్పంచ్ భాస్కర్, కొడకండ్ల ఎంపీటీసీ అశోక్,బి ఆర్ ఎస్ యూత్ వింగ్ నాయకుడు సంతోష్ రెడ్డి,బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు





