హైదరాబాద్: రాష్ట్రంలో ఇద్దరు ఎస్పీలు, 10 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా తెలిపారు. ఎస్పీల్లో ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న ఎం.శ్రీనివాసరావును విజిలెన్స్ విభాగానికి, ప్రస్తుతం విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న వై.సాయిశేఖర్ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు.
