కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ మల్లంపేట కేవీఆర్ కాలనీలో మమతా రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఐశ్వర్య బి హబ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిధులుగా ఈరోజు అధినాయకత్వం వహించారు. నాణ్యమైన సేవతో ప్రజల మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ చైర్పర్సన్ శంభీపూర్ కృష్ణవేణి కృష్ణ గారు, జీహెచ్సీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, డివిజన్ల అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నిర్వాహకులు ఉన్నారు.*





