181 Views

ముస్తాబాద్, జూన్ 17, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కనమేని చక్రధర్ రెడ్డి విద్యార్థులకు అక్షరాభ్యాసం వివరిస్తూ పిల్లలతోపాటు
పలకా, బలపం పట్టి అక్షరాలను దిద్దించారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించనున్న సంప్రదాయ కార్యక్రమంలో ముస్తాబాద్ కనమేని చక్రధర్ రెడ్డి సమక్షంలో పాఠశాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా కార్యక్రమాన్ని జరిపించారు. ఈకార్యక్రమంలో బిజెపి మండలం అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు జిల్లెల్ల మల్లేశం, ఉపేంద్ర, పిఎసిఎస్ డైరెక్టర్ మిరుదొడ్డి దేవయ్య, పప్పుల శ్రీకాంత్ బండి శ్రీకాంత్, శీలభాను, మీస శంకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found