
జగదేవపూర్ మండలం లోని చాట్లపల్లి గ్రామానికి చెందిన గడ్డం కల్పన భర్త భిక్షపతి దంపతుల కూతురు మౌనిక వివాహానికి స్థానిక సర్పంచ్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు మండలంలో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నా నాయకులు రాచర్ల నరేష్ గుప్తా పుస్తెమట్టెలు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో జరిగే ప్రతి వివాహానికి పుస్తె మట్టెలు అందజేస్తు గ్రామ ప్రజల కష్ట సుఖాలను పంచుకొంటూ ప్రజల కోసం నిత్యం నిరంతరంగా కృషి చేస్తున్న ఏకైక నాయకులు మా గ్రామ సర్పంచ్ నరేష్ గుప్తా అని గ్రామ ప్రజలు కొనియాడారు.
అనంతరం రాచర్ల నరేష్ గుప్తా మాట్లాడుతూ మనం సంపాదించిన దాంట్లో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడం లోనే సంతృప్తి ఆనందం కలుగుతుందని అన్నారు.
గ్రామం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానాని తెలిపారు.
గ్రామ అభివృద్ధితో పాటు సామాజిక కార్యక్రమాలు చేయడమే కర్తవ్యమన్నారు.
ఆడ బిడ్డ లు పెళ్లి చేసుకుంటే మన సీఎం కేసీఆర్ ఆడపిల్లల కోసం లక్ష నూట పదహార్లు రూ. కళ్యాణ లక్ష్మి. షాధిముబారక్ ద్వారా అందజేస్తున్నారని దానిలో భాగంగానే నా వంతు ఈ సహాయం చేస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కావ్య ధర్గయ్య, ఖదీర్,సులేమాన్. రమేష్.అనిల్.
తదితరులు పాల్గొన్నారు.




