ఎల్లారెడ్డిపేట్ యువమోర్చాలో యువకుల చేరిక*
ఎల్లారెడ్డిపేట్ మండలం సింగారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి దాదాపు 20 మంది యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చాలో చేర్చుకోవడం జరిగింది. ఆ యువకులను స్వాగతిస్తూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కారణమై అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రతి నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్లకి అన్నివేళలా తోడుంటారని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న యువకులు రాష్ట్ర ప్రభుత్వ చేస్తున్న అన్యాయాలపై ప్రశ్నించే గొంతుకలై అవుతారని మనస్ఫూర్తిగా భావిస్తామన్నారు కెసిఆర్ నియంత పాలన వల్ల చాలామంది యువకులు ఉద్యోగాలు లేక పిట్టల రాలిపోతున్నారు అన్నారు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల యువకుల పాత్ర కీలకమైనది అన్నారు అట్టి యువకులను రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కెసిఆర్ ప్రభుత్వం యువకులను పట్టించుకోవట్లేదు అన్నారు. మరి అదే సింగారం గ్రామానికి చెందిన కంచర్ల రోహిత్ ను మండల యువమోర్చా ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ యువమోర్చా అధ్యక్షుడు మెరుగు జితేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా ఉపాధ్యక్షులు దయాకర్ రెడ్డి సనత్ రెడ్డి సింగారం బూత్ అధ్యక్షులు దిలీప్ మధు ప్రవీణ్ జాషువా అభిలాష్ సందీప్ లోహిత్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు..




