150 Views(కరీంనగర్ మే 13) కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని మొలంగూరు గ్రామంలో పోలింగ్ స్టేషన్ 116 లో సాంకేతిక లోపం కారణంగా ఈవీఎం దాదాపు 30 నిమిషాల నుండి పనిచేయటం లేదు. అప్రమత్తమైన అధికారులు వెంటనే మరొక ఈవీఎం ను ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎం మోరాయించడం తో జనాలు బారులు తీరి నిలుచునే పరిస్థితి లేక వరండాలో కూర్చొని ఉండిపోయారు. Manne Ganesh Dubbaka constancy 9701820298
Breaking News
కార్పొరేట్లకే దేశ సంపద పదేండ్లుగా దోచిపెట్టిన మోడీ…
96 Viewsమే 12, 24/7 తెలుగు న్యూస్: కార్పొరేట్లకే దేశ సంపద పదేండ్లుగా దోచిపెట్టిన మోడీ… ప్రజలకు చేసిందేమీ లేదు చేసిన పనులు చెప్పుకోలేక మతచిచ్చు రాజేస్తున్న బీజేపీ తెలంగాణా చైతన్యం మరోసారి చాటాలి పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ అమలు చేస్తాం : ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకగాంధీ ”మోడీ పాలనలో బడా వ్యాపారులకే మేలు జరిగింది.. సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదు.. మోడీ ఏదైనా పని చేసినట్లయితే నేను ఈ పనులు చేశానని చెప్పేవారు. కానీ […]
చారిత్రక తీర్పు దిశగా ఓటర్లు.
90 Viewsమే 12, 24/7 తెలుగు న్యూస్ : చారిత్రక తీర్పు దిశగా ఓటర్లు. మే13 భారతీయుల, తెలుగు ప్రజల తీర్పు కొత్త చైతన్యానికి సంకేతం కాబోతున్నదా? ఇదే ప్రశ్న పరిశీలకులనూ చరిత్రకారులనూ ఆలోచింపచేస్తున్నది. మోడీ హ్యాట్రిక్ ఖాయమంటూ మొదలైన హంగామా ఆయన ట్రిక్కుల వేటతో రోజుకో మలుపు తిరుగుతున్నది. బహుశా ఏ ప్రధాన మంత్రి నుంచీ ఎన్నడూ వినని దారుణమైన, విద్వేష వాక్కులు మోడీ నోట వినవలసి వచ్చింది. మతాలపై పార్టీలపై కుటుంబాలపై, వ్యక్తులపై మోడీ […]
పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తాం…..
91 Viewsమే 12, తెలుగు న్యూస్ : ఎపికి పదేళ్లు ప్రత్యేక హోదా వైఎస్ షర్మిలను గెలిపించండి : కడప సభలో రాహుల్ గాంధీ ప్రజాశక్తి- కడప ప్రతినిధి : ఎన్నికల్లో ఇండియా వేదికను గెలిపిస్తే రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ప్రకటించారు. కడపలోని పుత్తా ఎస్టేట్లో శనివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజన సమయంలో రాష్ట్రానికి బిజెపి […]
అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్న పోలీసులు
140 Views(శంకరపట్నం మే 10) శంకరపట్నం మండల కేంద్రంలో అక్రమంగా బంకమట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను కేశవపట్నం పోలీసులు పట్టుకున్నారు. శంకరపట్నం మండల కేంద్రం నుండి కరీంనగర్ కు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా బంక మట్టిని మూడు టిప్పర్ల ద్వారా తరలిస్తుండగా పట్టుకొని గనులు భూగర్భజల శాఖ అధికారులకు అప్పజెప్పామని ఎస్సై లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేసే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.. Manne Ganesh Dubbaka constancy 9701820298
మంత్రి పొన్నం వాహనం తనిఖీ
170 Views(తిమ్మాపూర్ మే 10) పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద నిర్మించిన ఇంటిగ్రేడ్ చెక్ పోస్ట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ వాహనాన్ని నిలిపివేశారు. అనంతరం పోలీసులు, ఎన్నికల సిబ్బంది మంత్రి పొన్నం ప్రభాకర్ వాహనాన్ని తనిఖీ చేయగా వారికి పూర్తిగా మంత్రి పొన్నం ప్రభాకర్ సహకరించారు. తనిఖీల అనంతరం మంత్రి తన వాహనంలో కరీంనగర్ కి బయలుదేరి వెళ్లారు.. Manne Ganesh Dubbaka constancy 9701820298
బీఆర్ఎస్ పార్టీలో చేరిక
92 Viewsబీఆర్ఎస్ పార్టీలో చేరిక మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని ద్వారక గ్రామానికి చెందిన 70 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాలు, పార్టీని వీడి *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్, మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ సమక్షంలో* బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది… అనంతరం వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించిన […]
అంతులేని విషం….
99 Viewsమే 9, 24/7 తెలుగు న్యూస్ : అంతులేని విషం హిందూత్వ శక్తుల గ్రూపులు, యూట్యూబర్ల కథనాలే మూలం ‘ఆ వర్గం’పై ప్రజల్లో ప్రతికూలత కలిగేలా తీవ్ర ప్రచారం ఇందుకు కవిత్వాలు, పాటలనూ వదలని కాషాయపార్టీ ప్రధాని మోడీ, బీజేపీ తీరుపై మేధావులు, సామాజిక కార్యకర్తల ఆగ్రహం న్యూఢిల్లీ : గత కొన్నేండ్లుగా మోడీ పాలనలో ఒక వర్గానికి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం సాగింది. ముఖ్యంగా, కరోనా కాలంలో ఆ వర్గం వారిని సూపర్ స్ప్రెడర్స్(కరోనా […]
మంచిర్యాలలో బిజెపి పార్టీ బైక్ ర్యాలీ
132 Viewsపెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ బైక్ ర్యాలీ చేసింది .పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బిజెపి పార్టీ ఎర్రబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ మంచిర్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుండి శ్రీనివాస టాకీస్ చౌరస్తాలో ముగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధ్యప్రదేశ్ బిజెపి పార్టీ ఇన్చార్జ్ మురళీధర్ రావు పాల్గొన్నారు. మే […]










