హత్యాయత్నం కేసులో నలుగురు నిందితుల అరెస్టు
రామగుండం పోలీస్ కమిషనరేట్.
కాంట్రాక్టర్ బస్తీకి చెందిన ఫిర్యాదుదారుడు బత్తి సంతోష్,తండ్రి: రమేష్,వయస్సు 33 సం.లు,తన స్నేహితుడు సాగర్తో కలిసి 05-07-2026 రాత్రి రాయల్ బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవిస్తుండగా నిందితులు అక్కడికి వచ్చి “వీడియో ఎందుకు తీస్తున్నారు?”అంటూ వాగ్వాదానికి దిగారు.
అనంతరం బ్రదర్స్ బేకరీ ఎదుట మళ్లీ ఎదురుపడి గొడవకు దిగగా,ప్రధాన నిందితుడు రాసబత్తుల గణేష్ కత్తితో దాడి చేయగా, మిగతా నిందితులు ఫిర్యాదుదారుడిని పట్టుకున్నారు.ఈ దాడిలో ఫిర్యాదుదారుడికి ఎడమవైపు ఛాతిపై, సాగర్కు కుడిచేతి మోచేయిపై రక్తగాయాలయ్యాయి. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు కొత్త బస్టాండ్ సమీపంలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు తెలిపారు.
అరెస్టు చేసిన నిందితుల వివరాలు:
A2:అచ్చ శివకుమార్ తండ్రి: లింగయ్య, వయస్సు 30 సం.లు, వ్యవసాయం, నివాసం:చిన్నబూద.
A3:ఒడ్డి వెంకటేష్ తండ్రి: శ్రీనివాస్, వయస్సు 44 సం.లు, ఫోటోగ్రాఫర్,నివాసం: చిన్నబూద.
A4:మహ్మద్ అబిద్ తండ్రి: చాంద్ పాషా, వయస్సు 34 సం.లు, కూలి, నివాసం: హనుమాన్ బస్తీ, బెల్లంపల్లి.
A5:తిప్పని లరాజు తండ్రి: తిప్పని లింగయ్య,వయస్సు 24 సం.లు, వృత్తి: కూలి,నివాసం: చిన్నబూద.
పరారీలో ఉన్న నిందితుడి వివరాలు:
A1:రాసబత్తుల గణేష్ తండ్రి:వెంకటేష్, నివాసం:హనుమాన్ బస్తీ,బెల్లంపల్లి.
ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు హెచ్చరించారు.





