ఈ నెల 6న ప్రజావాణి రద్దు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ !
మంచిర్యాల జిల్లా ఏప్రిల్ 5, 2026:
ప్రతి సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 6వ తేదీన రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా బాసర, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేయడం జరిగిందని, తదుపరి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని, ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని తెలిపారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





