ముస్తాబాద్, డిసెంబర్ 24

(24/7న్యూస్ ప్రతినిధి) ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోంది. నడిరోడ్డుపై తాగునీరు పైప్ లైన్ లీకై వృధా పోవడం నెల రోజులైనా నీటి వృథాను అరికట్టడంలో అధికారలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాారు. రోడ్డుపై లీకైననీరు వృధాగా పోవడం నిర్లక్ష్యం ధోరణిలో ఇటు ప్రజలకు అటు వాహనదారులకు శాపంగా మారిందని పలువురు మండిపడుతున్నారు. గ్రామపంచాయతీ ఆవరణలోనే ఉన్న గుర్తించకపోవడం గమనార్హం.. ముస్తాబాద్ గ్రామపంచాయతీ పక్కనుండి దుబ్బాక రోడ్డు వైపు రహదారిలో ఉన్న లీకేజీ పైపులను ఇప్పటికైనా తాగునీరు వృధా పోకుండా అరికట్టే చర్యలు తీసుకోవాలని మండలప్రజలు కోరుతున్నారు.




