Breaking News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి సంబరాలు చేసుకున్న గ్రామస్తులు

278 Views

కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, చల్లూరు గ్రామంలో లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నాగరాజు అనే ఈ కార్యదర్శిని పట్టుకోవడంతో గ్రామంలోని ప్రజలు పటాకులు కాల్చి, సంబరాలు జరుపుకున్నారు.

గ్రామంలో కొత్తగా నిర్మించుకున్న ఇంటికి నెంబర్ కేటాయించడానికి నాగరాజు రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత వ్యక్తి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి, డబ్బులు తీసుకుంటుండగా నాగరాజును పట్టుకున్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *