సొంత గడ్డ పై ఎమ్మెల్యే సత్యం మమకారం:: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేర్ నీటి ప్రవాహం లో చిక్కుకున్న వారిని బోట్లలో (పడవ)లో సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం కోసం మరో గంట లోపు పడవలను పంపించనున్నట్లు చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం “సత్యం మిత్ర మండలి ఎల్లారెడ్డిపేట” ఒగ్గు బాలరాజ్ మరియు మిత్రులకు కు ఫోన్ ద్వారా తెలిపారు.హెలికాప్టర్ ద్వారా రక్షించే ప్రయత్నం చేశామని, వాతావరణం సహకరించే పరిస్థితి లేనందున పడవలను పంపించి వరద నీటి ప్రవాహం లో చిక్కుకున్న వారిని క్షేమంగా వారి ఇండ్లకు చేరుస్తామని ఎమ్మెల్యే సత్యం అన్నారు.





