మంచిర్యాల జిల్లా.
విప్లవ గేయాలతో సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కు వీడ్కోలు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ని గౌతమీ నగర్ లో విప్లవ గేయాలతో విప్లవకారుడు, అమరజీవి కామ్రేడ్, సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కు ఏ ఐ సి టి యు నాయకులు వీడ్కోలు పలికారు.
అలుపెరుగని కమ్యూనిస్టు, కలం యోధుడు, అమరజీవి కామ్రేడ్, సీనియర్ జర్నలిస్ట్ మునీర్ అని ఏఐసిటియు నాయకులు కొనియాడారు. మంచిర్యాలలో ఆయన పార్దవ దేహానికి నివాళి అర్పించారు. అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం జాతీయ కార్యదర్శి సబ్బని కృష్ణ, జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో విప్లవ గీతాలతో జోహార్లు అర్పించారు. ఆయన వాడిన పాట పలువురిని కంటతడి పెట్టించింది. మునీర్ స్ఫూర్తి తోనే ఎంతోమంది ప్రజలు, కార్మికులు ఉద్యమ బాట పట్టారు అని అన్నారు.





