మంచిర్యాల జిల్లా.
నష్టపోయిన పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ – రఘునాథ్ వెరబెల్లి .
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ఈరోజు దండేపల్లి మండలం కోర్విచెల్మ గ్రామంలో నేలకు ఒరిగి తీవ్ర నష్టం జరిగిన మక్క పంటను ఈరోజు మండల నాయకులతో కలిసి బీజేపీ మంచిర్యాల మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పంటను పరిశీలించి జరిగిన నష్టం పై రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ అకాల వర్షం వలన జిల్లా వ్యాప్తంగా పంటలు నష్టం జరుగు మూడు రోజులు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుండి నష్ట పరిహారం పై ఇప్పటి వరకు ఎలాంటి నష్ట పరిహారం పై ప్రకటన చేయలేదు అని అన్నారు. ఎంత మేర నష్టం జరిగిందో కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సర్వే చేయలేదని అన్నారు. అకాల వర్షంతో రైతులు కష్టపడి పండించిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో రైతులకు నష్ట పరిహారం చెల్లించకపోతే రైతుల పక్షాన వారికి నష్ట పరిహారం చెల్లించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోపతి రాజయ్య, ముఖేష్ గౌడ్,బోడకుంటి వెంకటేష్, పతిపాక సంతోష్, కొండ నరేష్, బత్తుల శేఖర్, అప్పని తిరుపతి, మల్యాల రమేష్, గడికొప్పుల సురేందర్, దుమ్మని సత్తయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.
