విగ్రహ ఏర్పాటుకు లక్ష రూపాయల విరాళం…
(తిమ్మాపూర్ జనవరి 22)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు కొరకు తనుశ్రీ ఇన్ప్రా మార్కెటింగ్ డెవలప్మెంట్ చైర్మన్ ఎలుక సంతోష్ తన వంతుగా లక్ష రూపాయలు తెలంగాణ రాష్ట్ర పౌరాసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు చెక్కును విరాళంగా అందజేశారు.. ఈ సందర్బంగా మంత్రి, ఎమ్మెల్యే అభినందించారు..
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, తిమ్మాపూర్ మండలం మాల మహానాడు అధ్యక్షులు ఎలుక రాజు, తనుశ్రీ ఇన్పా డెవలపర్స్ డైరెక్టర్లు నేరెళ్ల స్వామి, అజయ్, నరేష్,జ్యోతి, అంబేద్కర్ సంఘం నాయకులు,కాంగ్రెస్ నాయుకులు తదితరులు పాల్గొన్నారు..





