ప్రాంతీయం

ఎన్టీఆర్ కీ భారతరత్న ఇవ్వాలి

116 Views

 

 

ఎన్టీఆర్ కీ భారతరత్న ఇవ్వాలి

నేడు 29వ,వర్ధంతి వేడుకలు ఘన నివాళులు అర్పించిన – ప్రముఖ సామజిక కార్యకర్త పిడిశెట్టి రాజు 

సిద్దిపేట జిల్లా  జనవరి 18,

హుస్నాబాద్ భార్గవాపురం అసెంబ్లీ నియోజకవర్గం కోహెడ మండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యుగపురుషుడు దివంగత మహానేత నందమూరి తారక రామారావు 29వ, వర్ధంతి వేడుకలు ప్రముఖ సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగువారు ఎక్కడున్నా గర్వముగా చెప్పుకునే వ్యక్తి,తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలు చాటి చెప్పిన గొప్ప మహనీయులు నందమూరి తారక రామారావు వారి సేవలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి భారత అత్యుత్తన్నత పురస్కరం భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోడీ కీ రాజు విజ్ఞప్తి చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్