చిత్రంతో ఘన నివాళి అర్పించిన రామకోటి రామరాజు
ఒక గొప్ప వ్యక్తిని ఈ దేశం కోల్పోయింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 27
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమణి అయన చిత్రాన్ని అవాలతో అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాప, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఒక గొప్ప వ్యక్తిని ఈ దేశం కోల్పోయింది. తనదైన ప్రతభ, జ్ఞానంతో భారత దేశానికి ప్రధానిగా అపూర్వ సేవలందించిన మహానీయుడన్నాడు. తెలంగాణ ప్రజల ఎన్నో దశబ్దాల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను నెరవేర్చింది మన్మోహనే అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈ చిత్రాన్ని చిత్రించి ప్రార్థిస్తున్ననన్నాడు.





