మంచిర్యాల జిల్లా:
మందమర్రి మార్కెట్,రామకృష్ణపూర్ లో అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి.
పంచశీల జెండాను ఆవిష్కరించిన ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి.
పాల్గొన్న మాజీ ఎమ్మేల్యే నల్లాల ఓదెలు,మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్.దళిత సంఘాలు,కార్మిక,రాజకీయ సంఘాల లీడర్లు పాల్గొన్నారు.
*ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కామెంట్స్*
ఎమ్మెల్యే గా మొదటిసారి మందమర్రి అంబెడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది.
అందరికి స్ఫూర్తి, దారి చూపిన మహనీయుడు అంబేద్కర్
దేశంలో కుల వివక్ష ఉండేది దీన్ని రూపుమాపి అంబెడ్కర్ దళితులను,పేదలను ఆదుకున్నారు.
ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ విగ్రహాలు అంబేద్కర్ వే ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా కాకా వెంకటస్వామి అనేక కాంస్య విగ్రహాలు ఇచ్చారు.
ఇప్పటి వరకు తాను 110 అంబెడ్కర్ విగ్రహాలు ఇచ్చాను.
అంబెడ్కర్ విగ్రహాలు పంపిణీ చేసే వరం ఆ దేవుడు కల్పించాడు.
అంబెడ్కర్ ఆశయం కూల వ్యవస్థ దూరం చేయడమే …ఆయన స్ఫూర్తి గా అందరం కలిసికట్టుగా పనిచేయాలి.
దళితులకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత అంబెడ్కర్ దే.
మందమర్రి లో మంచి కాంస్య విగ్రహం ఇస్తా, అంబెడ్కర్ భవనం కట్టిస్తా.
అందరూ ఐక్యంగా ఉండాలి, విభేదాలు పక్కన పెడితే అన్నిటికీ నేను అండగా ఉంటా.





