ముస్తాబాద్, డిసెంబర్ 24 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామంలోని డబుల్ బెడ్రూం కాలనీలో పోలీసు అధికారులు చేరుకొని సీసీ కెమెరాల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాలు, కుల నిషేధం, సైబర్ నేరాలు పట్ల
పలు అంశాలపై చర్చించి సంబంధిత కాలనీ వాసులను మంగళవారం సాయంకాలం ఒకేచోట సమావేశం ఏర్పరిచి అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ప్రయాణం, నెంబర్ ప్లేట్లు లేని వాహనం, డ్రైవింగ్ లైసెన్ తో పాటు మైనర్లకు వాహనం ఇస్తే వాహనం సీజ్ చేసి వాహన యజమానులపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. గ్రామాలలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బ్లాక్ మ్యాజిక్పై అవగాహన కల్పించేందుకు నేరాలపట్ల సిఐ మొగిలి, ఎస్ఐ సిహెచ్. గణేష్ చర్చించారు. అక్రమమార్గంలో ఎటువంటిమద్యం, ప్రజలను ప్రలోభపెట్టే వస్తువులను గ్రామాలలోనికి రాకుండా వివిధశాఖలలో పోలీస్ అధికారులు సమన్వయంతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. యువత రోజురోజుకు నిషేధిత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వారి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.




