కొమురం భీం జిల్లా
*ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన*
కొమురం భీం జిల్లా, కాగజ్ నగర్ పట్టణంలో ని కిమ్స్ మల్టిస్పెషలిటీ ఆసుపత్రిలో కొత్తపల్లి వెంకట లక్ష్మీ – చంద్రయ్య మెమోరియల్ సర్విస్ సొసైటీ వ్యవస్థాపకులు మరియు బిజెపి కొమురం భీం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ డాక్టర్ కొత్తపల్లి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితం కంటి పరీక్షలకు 22 మంది హాజరు కాగా వారిలో 8 మందికి శస్త్రచికిత్స అవసరమని ఈ సందర్భంగా కంటి పరీక్షలకు వచ్చిన వృద్దులను అధైర్య పడవద్దని లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి వారి సహకారంతో ఉచితంగా ఆపరేషన్ లు చేపిస్తామని ఈ ఉచిత కంటి శిబిరం ప్రతి మంగళవారం నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని ప్రజాలందురు సద్వినియోగ పర్చుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్తమలజిస్ట్ శ్రీనాథ్, ఐ క్యాంప్ ఇన్చార్జి గోపి పాల్గొన్నారు.
