నూతనంగా ఎస్బిఐ వినియోగదారుల సేవా కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా మేనేజర్ అమరేందర్ రెడ్డి ప్రారంభించారు. రాయపోలు మండల పరిధిలోని రాంసాగర్ గ్రామంలో ఎస్బిఐ వినియోగదారుల సేవ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మంచి సేవలు అందించాలని ఉద్దేశంతోనే ఎస్బిఐ వినియోగదారుల సేవా కేంద్రాన్ని ప్రారంభించమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందించాలని ఆయన తెలిపారు. చింత నవనీత ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందిస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రాజిరెడ్డి, కొండారి గణేష్, కొండారి రమేష్, బట్టి రఘపతి, ఆదిరెడ్డి, జగ్గోల్ల సురేష్, సాల్వేరి కృష్ణ, చిట్టమైన లింగం, మైసని ప్రభాకర్, రాగి చంద్రం, రాగి స్వామి, జోడు స్వామి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.




