శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం
అనంతమైన పుణ్యాలను అందించేదే కార్తీక మాసం
భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
సిద్దిపేట జిల్లా నవంబర్ 13
కార్తీకమాసం మించిన మాసం మరొకటి లేదని, దీపారాధన ఈ మాసంలో చాలా శ్రేష్ఠమైదని బుధవారం నాడు మహా శివునికి అభిషేకాలు నిర్వహించి అనంతరం పసుపు, కుంకుమతో భారీ శివలింగాన్ని అద్భుతంగా రూపొందించి చుట్టూ దీపాలను వెలిగించి దీపోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ కార్తీక మాసంలో ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, బంధు, మిత్రులతో వనభోజనాలు చేయడం వల్ల జన్మజన్మల పాపాలు ప్రక్షాళన జరిగి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీకమాసం అన్నారు. మన భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఈ నెల రోజులు పండుగ పర్వదినాలే అన్నారు.





