ప్రాంతీయం

వినాయకుని దర్శించుకున్న తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి

38 Views

మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగో వార్డ్ లో ఉన్న వినాయకుని మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి.
ఈ సందర్భంగా తిర్మల్ రెడ్డి మాట్లాడుతూ విజ్ఞేశ్వరుడి దయతో గ్రామ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.అనంతరం వార్డ్ సభ్యులు అందరూ కలిసి వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ ,ఉప్పసర్పంచ్ పద్మనర్సింలు, లక్ష్మణ్ ,స్వామి, నాగరాజు పంతులు ,వేణుగోపాల్,నవీన్,హరీష్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్