మర్కుక్ మండల కేంద్రంలో వన మహోత్సవం ప్రారంభం
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 5)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజి సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సెక్రెటరీ, సిఏలు, మహిళ సంఘాలు, తదితరులు పాల్గొన్నారు
