(మానకొండూర్ జూన్ 15)
మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన పేదలకు గామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్, ఈసి చైర్మన్ సరోజన ఆదేశాల మేరకు మండల కో ఆర్డినేటర్ పాముల మరియా ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.
రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలకు మూడు నెలల పాటు సరుకులను అందజేస్తామని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
ఈ అవకాశాన్ని పేదలు ఉపయోగించుకోవాలని కోరారు…





