ప్రాంతీయం

గులాబీ జెండా ఎగరడం ఖాయం

73 Views

రెండు రోజుల్లో మెదక్ గడ్డమీద గులాబీ జెండా ఎగరడం ఖాయం

తనేదర్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఆంజనేయులు మాజీ అధ్యక్షులు శంకర్ గౌడ్

సిద్దిపేట జిల్లా జూన్ 2

సిద్దిపేట జిల్లా రెండు రోజుల్లో ఎంపి ఎన్నికల ఫలితాల్లో మెదక్ గడ్డమీద గులాబీ జెండా ఎగురవేసి మరోసారి ఉమ్మడి మెదక్ జిల్లా గులాబీ పార్టీ కంచుకోట అని నిరూపిస్తామని తానేధర్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ అధ్యక్షుడు గొల్లపల్లి శంకర్ గౌడ్, అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు రోజుల్లో వచ్చే పార్లమెంట్ ఫలితాల్లో మెదక్ గడ్డమీద వెంకట్రాం రెడ్డి అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు.

రాజీలేని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు గత పదేళ్లలో తెలంగాణ ఖ్యాతిని దేశంలోనే మొదటి స్థానంగా గా నిలిపే దిశలో అన్ని రంగాల్లో అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నడిపిన గొప్ప నాయకుడు గులాబీ అధినేత కేసిఆర్ అని కొనియాడారు.

దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం సహకారం అందించకున్నా కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తెలంగాణలో అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కెసిఆర్ కొనసాగించి రాష్ట్రంలో ఒక బలమైన ఆర్థిక సామాజిక పునాదిని వేశారని తెలిపారు. కానీ నేడు రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ కక్షసాధింపులతోనే కాలం గడుపుతూ పాలనను గాలికొదిలేసిందని విమర్శించారు.

రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతును, వ్యవసాయాన్ని ప్రథమ ప్రాధాన్యత గా తీసుకొని పని చేసి వరి పంట ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానానికి తీసుకువచ్చిన ఘనత మన గులాబి అధినేత కేసీఆర్ ది అన్నారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటు కరెంట్,అటు సాగునీళ్లు ఇవ్వకుండా పంటలను ఎండబెతుందని మండిపడ్డారు.

ప్రభుత్వానికి ముందుచూపు పట్టింపులేని కారణంగా కరువు పరిస్థితులు అలుముకున్నాయని ఎద్దేవా చేశారు.100 అబద్దాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వంద రోజులు ఆరు గ్యారెంటీ అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చి, వరి పండించే రైతులకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి నేడు ఎన్నికల కోడ్ వచ్చిందని మాయమాటలు చెబుతున్నారు అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అడుగుపెట్టగానే కరువు వచ్చిందన్నారు.

ఒక్క ఉద్యోగ పరీక్ష నిర్వహించకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు అని అన్నారు. కెసిఆర్ హయాంలోని ఇంటింటికిమంచి నీళ్ళు, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, చెరువు కుంటలు బాగు చేయడం జరిగిందని, రైతు బంధు, రైతు బీమా ద్వారా రైతులను అదుకున్నది కేసీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్