(తిమ్మాపూర్ ఏప్రిల్ 17)
తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
వేద పండితులు కన్నుల పండుగగా నిర్వహించిన తంతును తిలకించేందుకు భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు..





