Breaking News

రసమయిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే… జర్నలిస్టుల రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్ డిమాండ్.

99 Views

రసమయిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే…
గ్రామీణ విలేకరులను విధుల నుండి తప్పించినంతమాత్రాన బెదిరేది లేదని
గన్నేరువరం ప్రజలు చేపట్టే ప్రజాస్వామిక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటాం
ఆయా ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తాం
నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం

————————–

మానకొండూరు శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ శుక్రవారం గన్నేరువరం మండల కేంద్రంలో విలేకరులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది.
ఆయన వ్యాఖ్యలు జర్నలిస్టులను బెదిరించేవిగా, తమ పార్టీ కార్యకర్తలను వారిపైకి ఉసిగొలిపేలా ఉన్నాయని అభిప్రాయపడింది.
ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే చట్టపరమైన చర్య తీసుకోవాలని యూనియన్ డిమాండ్ చేసింది.
గన్నేరువరం మండల అభివృద్ధికి సంబంధించి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అభివృద్ధి కాముకులు చేపట్టే ఆందోళనలకు గన్నేరువరం ప్రెస్ క్లబ్ తో పాటు జిల్లా యూనియన్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
శనివారం కరీంనగర్ ప్రెస్ భవన్లో జిల్లా యూనియన్ అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, దాడుల నివారణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఐలు రమేష్, జిల్లా యూనియన్ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ నాయకత్వంలో గన్నేరువరం ప్రెస్ క్లబ్ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో గుండ్లపల్లి నుండి గన్నేరువరం వరకు రహదారి నిర్మాణం కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొనాలని తీర్మానించడం జరిగింది.
భవిష్యత్తులో గన్నేరువరం అభివృద్ధికి సంబంధించి ప్రజలు చేపట్టే ప్రతి ఆందోళన కార్యక్రమంలో అక్కడి ప్రెస్ క్లబ్ తో పాటు జిల్లా యూనియన్ భాగస్వామ్యం కావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
“మేము మీకు బానిసలం కాదు ప్రజలకు మాత్రమే బానిసలం”
మీరు పిడికెడు అంతమంది… మేము గుప్పెడంత మందిమి”
అంటూ శాసనసభ్యుడు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ జర్నలిస్టులను జర్నలిస్టులను ఉద్దేశించినవేనని యూనియన్ భావించింది.
తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్న కారణంతో, అందులో గన్నేరువరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నాడన్న కోపంతో ఆయనను రాత్రికి రాత్రే విధుల నుండి తప్పించడం వెనక ఎమ్మెల్యే ప్రమేయం ఉందని యూనియన్ విశ్వసిస్తున్నది. వారి చేతుల్లో ఉన్న పత్రికల నుండి విలేకరులను తొలగించడం పత్రిక స్వేచ్ఛను హరించడంగా యూనియన్ భావించింది. పత్రికల నుండి విలేకరులను తొలగించినంతమాత్రాన భయపడేది లేదని యూనియన్ స్పష్టం చేసింది.
త్వరలో జరగనున్న జిల్లా కార్యవర్గంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించి జిల్లా వ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వాలని యూనియన్ నిర్ణయించింది.
తొలగించిన నమస్తే తెలంగాణ విలేకరి శ్రీనివాస్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని యూనియన్ డిమాండ్ చేసింది.
ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నగునూరి శేఖర్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎలగందుల రవీందర్ తో పాటు గన్నేరువరం ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్