జీవితాంతం ప్రజాసేవలోనే ఉంటా
(ఏప్రిల్ 7) తెలుగు న్యూస్ ప్రతినిధి
–పేదవారికి సేవలందించడమే నా ముఖ్య లక్ష్యం
–సిద్దిపేట తెలంగాణకే ఆదర్శం
–గంగా జమున తహీజిబ్ కు సిద్దిపేట కేంద్ర భీందువు
— అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసమే పని చేస్తాం
మాజీమంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు
సిద్దిపేట :
జీవితాంతం ప్రజాసేవలో ఉంటానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని లిమ్రా గార్డెన్ లో ఆదివారం జరిగిన దావతే ఇప్తార్ విందులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట గంగా జమున తహజీద్ కు కేంద్ర బిందువు అని అన్నారు. నాటి ఎమ్మెల్యేలు మదన్మోహన్, కేసీఆర్ కాలం నుండే ఇక్కడి ప్రజలు సోదరబావంతో కలిసి మెలిసి ఉంటారని అన్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.రాష్ట్రంలోనే తొలిసారిగా ఆఖరి సఫర్ అనే అంతిమా యాత్ర వాహనాన్ని సిద్దిపేట లోనే అందుబాటులోకి తేవడంతో పాటు డెడ్ బాడీలను నిల్వ ఉంచడానికి అన్ని మస్జీద్ లలో ఫ్రీజర్లను అందుబాటులో ఉంచడం జరిగింది.నా సొంత డబ్బులతో సిద్దిపేట ముస్లింల కోసం ఎన్సాన్పల్లిలో మూడు ఎకరాల భూమిని కొనిచ్చి బోరు మోటర్ ను వేసి పెన్సింగ్ వేసి, గేటు పెట్టి ఇచ్చాను నేడు ఆ భూమికి కోట్ల విలువ వచ్చింది. సిద్దిపేటలోని అన్ని దర్గా, మజీద్, ఖాభారస్థాన్ ల నిర్మాణాలు మారమ్మత్తుల కోసం ప్రత్యేకంగా నిధులు ఇచ్చాను. ఇమామ్, మౌజనులకు జీతభత్యాలను అందించామన్నారు. ప్రభుత్వం లో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తాం అని అన్నారు.నిరుపేద ముస్లిం మహిళలలు ఉపాధి పొందాలన్నా లక్ష్యంతో నేను సొంతంగా కుట్టు మిషన్లను అందించాను.ప్రతి ఏటా నా సొంత డబ్బులతో పదిమంది నిరుపేదలకు ఉమ్రయాత్రను పంపిస్తున్నాను అలాగే బతికున్నంత కాలం ప్రతి సంవత్సరం పంపిస్తూనే ఉంటాను. ప్రతి రంజాన్ కు నా సొంత డబ్బులతో పాటు ఆర్ఆర్ మసాలా సంస్థ సహకారంతో సుమారు 4 మంది నిరుపేద ముస్లింల కోసం ఉచిత రేషన్ కిట్లను అందిస్తున్నాను.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి హజ్ హౌస్ నిర్మాణం సిద్ధిపేట లోనే చేసుకున్నాము. మదీనా ఫంక్షన్ హాల్ కు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకున్నాము.ఇందుకు సంబంధించి 25 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో పండుగ రోజున నమాజు వేళలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సిద్దిపేట మున్సిపాల్ పాలకవర్గం సహకారంతో పూర్తి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి రంజాన్ మాసం సందర్భంగా ముస్లీం సోదరులకు
శుభాకాంక్షలు తెలియజేశారు.. మీ
ప్రార్థనలు ఫలించాలని ఆయన
ఆకాంక్షించారు.సిద్దిపేట ముస్లీమ్
సోదరులతో..ఎంతో అనుబంధం ఉందని
గుర్తు చేశారు…వొచ్చే ఎన్నికల్లో తనను
అశీర్వదించాలని కోరారు.. కార్యక్రమంలో
ఇఫ్తార్ విందులో ,మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, తంజిం ప్రతినిధులు,ముస్లిం మత పెద్దలు అబ్దుల్ సమీ, ఆసిఫ్, అబ్దుల్ వహీద్, జావీద్, తహెర్,ప్రజా ప్రతినిధులు, నాయకులు కడవేరు రాజానర్సు,
వేలేటి రాధాకృష్ణ శర్మ, గుండు భూపేష్, పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, వజీరుద్దీన్,ఫక్రుద్దీన్, మోయిస్, నాగరాజు రెడ్డి, మల్లికార్జున్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
