ప్రాంతీయం

రాజాసింగ్ విడుదలపట్ల హర్షం వ్యక్తం చేసిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి…

149 Views

ముస్తాబాద్/నవంబర్ 11: రాజన్న సిరిసిల్ల; బిజెపి పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే హిందూ టైగర్ రాజా సింగ్ పై అక్రమ పి డి యాక్ట్ పెట్టి జైలుకు పంపించిన ప్రభుత్వానికి చెంపపెట్టు లాగా పిడి యాక్ట్ ను ఎత్తివేసి హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.. గత రెండు నెలలుగా అక్రమ కేసులతో రాజా సింగ్ ను జైలులోఉంచడాన్ని ఈసందర్భంగా తీవ్రంగా ఖండించారు.ఏప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. హిందూ పరిరక్షణకు ముందుండే వారికి ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని, ప్రజల యొక్క దీవెనలతో రాజా సింగ్ నిర్దోషిగా బయటకు రావడం జరిగిందని అన్నారు. రాజాసింగ్ విడుదలపట్ల హర్షం వ్యక్తం చేశారు..

No Slide Found In Slider.

Poll not found