రాజన్న సిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన కందునూరి వెంకటేష్ గౌడ్ కు 18 నెలల వయసు గల నేహన్య చిన్నారి టేబుల్ ఫ్యాన్ ముట్టుకోగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చనిపోయింది. కోన ఊపిరితో ఉన్న ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికె మృతిచెందినట్లు నిర్థారించారు.పాప తండ్రి బతుకుదెరువు రీత్యా దుబాయ్ దేశములో ఉన్నారు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి చిన్నారి మృతి పట్ల సర్పంచ్ రాదరపు పుష్పల-శంకర్,ప్రముఖ ఎన్నారై రాధారపు సత్యం ,ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ యాదవ్ లు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.





