కన్నుల పండువగా శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో లక్ష పుష్పార్చన
హల్దిపూర్ వైశ్య గురు మఠ పీఠాధిపతి శ్రీ శ్రీ వామన ఆశ్రమ మహా స్వామీజీ చే
102 దేవాలయాలలో లక్ష పుష్పార్చన
ఎల్లారెడ్డిపేట జనవరి 27 :
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో హల్దిపూర్ వైశ్య గురు మఠం పీఠాధిశులు పరమ పూజ శ్రీశ్రీ వామనాశ్రమ మహా స్వామిజి చే శుక్రవారం సాయంత్రం 6-00 గంటలకు లక్ష పుష్పార్చన కార్యక్రమం కన్నుల పండుగ గా జరిగింది ,
ఎల్లారెడ్డిపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా చిన్న మల్లేశం ఆధ్వర్యంలో వాసవి ఆర్యవైశ్య సంఘం మహిళలందరూ ఏకరూప దుస్తులు దరించి మాతకు పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు,
ఈ కార్యక్రమంలో
ఎల్లారెడ్డిపేట ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు బొమ్మకంటి రాజయ్య , రాజేశం , బొమ్మ కంటి భాస్కర్ , భచ్చు ఆంజనేయులు , తాటీపెల్లి సుధాకర్, చకిలం మధు , నారాయణ, తోట శ్రీనివాస్ , గరిపెల్లి అశోక్ , రాజు , తోట వేణు తదితరులు పాల్గొన్నారు,





