సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నిరసన
డిసెంబర్ 19
సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నిరసన మిగతా 80 మంది వేతనాలు పెంచే వరకు నిరసన కార్యక్రమం చేపడతాం. నారాయణఖేడ్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం సిఐటియు
నారాయణఖేడ్ మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మున్సిపల్ కార్మికులు 82 మంది వర్కర్లు ఉండగా ఇద్దరికి మాత్రమే వేతనాలు పెంచడం జరిగింది మిగతా 80 మందికి కూడా వేతనాలు పెంచాలని నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజుకి 8వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ఇక్కడున్న మున్సిపల్ కమిషనర్ మేనేజర్ స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఒకవేళ ఈ సమస్య పరిష్కారం చేయకుంటే రెండు మూడు రోజుల్లో సమ్మెకు కూడా సిద్ధమవుతామని హెచ్చరించారు ఇకనైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు సాయిలు కుమార్ నారాయణ సిద్ధమ్మ శకుంతల రవి సాయిలు పవన్ రాజు యేసు తదితరులు పాల్గొన్నారు





