ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణం చున్నం బట్టి వాడ, సాయి కుంట లో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ మరియు హజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో వెరబెల్లి స్రవంతి ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ది కొరకు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది.
కేవలం బీజేపీ పార్టీ తోనే సూపరి పాలన సాధ్యం అని బీజేపీ ప్రకటించి మానిఫెస్టో లో అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందేలా రూపొందించడం జరిగింది అని తెలిపారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని రఘునాథ్ తెలిపారు.






