Breaking News

ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

216 Views

ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

అక్టోబర్ 05

సిద్దిపేట జిల్లా  ఏ బీ వీ పీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక విక్టరీ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సంధర్బంగా ఏ బీ వీ పీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ బీరకాయల వివేక్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం పేపర్ లీకులతో, పరీక్షల రద్దులతో మొదటి స్థానంలో నిలిచిన ఘనత కెసిఆర్ కె దక్కుతుందని గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రెండోసారి రద్దు కావడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య పూరిత వైఖరి అని మండిపడ్డారు .గతంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మరియు ఇతర ప్రశ్నపత్రాలను అమ్ముకోవడానికి ప్రయత్నించి లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలను రోడ్డున పడేసిన రాష్ట్ర ప్రభుత్వం పైన చేసిన అనేక ఉద్యమాల కారణంగా పరీక్షలను రద్దుచేసి నిర్వహించిన రీ ఎగ్జాం లో కూడా సరైనటువంటి చర్యలు పాటించకుండా ఇష్టానుసారంగా గ్రూప్ -1ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించి రెండోసారి కూడా పరీక్ష రద్దుకి కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండోసారి నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ వివరాలు , హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓ ఏం ఆర్ అసైంటిఫిక్‌ గా పరీక్ష నిర్వహించడం కారణంగా పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రెండోసారి గ్రూప్-1 పరీక్ష రద్దు చేయడం జరిగింది.ఈ ప్రభుత్వానికి ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఉద్దేశం లేదని ఎలక్షన్లు దగ్గరకొస్తున్నాయనే కారణంతో ఓటు బ్యాంకు కోసం అడప, తడప నోటిఫికేషన్లు ఇస్తూ పేపర్ లీకేజీలతో కుట్రపూరితంగా నిరుద్యోగుల జీవితాలను రోడ్డుకి ఈడుస్తున్నారని మండిపడ్డారు.

దీనిలో భాగంగా పేపర్లు అమ్ముకోవడానికి ప్రయత్నించడం, ప్రశ్న పత్రాల్లో తప్పులు దొర్లే విధంగా వ్యవహరించడం ఏదో ఒక రకంగా కోర్టు ద్వారా పరీక్షను రద్దు చేయించి ఉద్యోగాల భర్తీని ఆపడం కోసం చేస్తున్న కుట్ర మరోసారి తేటతెల్లమైంది అన్నారు. నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు చల్లుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనైతికంగా నిరుద్యోగుల పట్ల శాపంగా మారిందని అన్నారు.గతంలో ఏబీవీపీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కి కారణమైన నిర్లక్ష్య ప్రభుత్వం పైన అనేక ఉద్యమాలు చేసి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని, పేపర్ లీకేజీకి కారణమైన టీఎస్పీఎస్సీ సెక్రటరీ ,చైర్మన్ లను తొలగించి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా మరొకసారి టీఎస్పీఎస్సీతో కుమ్మక్కై కుట్రపూరితంగా రెండోసారి పరీక్ష రద్దు కావడానికి కారణమైందని అన్నారు.

గతంలో పేపర్ లీకేజీ సంఘటన పైన కనీసం స్పందించని చేతగాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి నిరుద్యోగులకు ఏ విధంగా భరోసాని ఇస్తాడో వెంటనే బహిర్గతంగా క్షమాపణ చెప్తూ తమ తప్పుని ఒప్పుకొని బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఏళ్ల తరబడి కొలువుల నినాదంతో ఏర్పడ్డ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు తమ సర్వస్వాన్ని ధారపోసి కోటి ఆశలతో కొలువుల కోసం కష్టపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పేపరు లీకులతో పరీక్ష రద్దులతో తొమ్మిదేళ్లుగా నియామకాలను తుంగలోకి తొక్కుతూ లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇక పరిపాలించే నైతిక బాధ్యత లేదని హెచ్చరించారు

వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి దీని పట్ల స్పందించి తప్పిదాలు ఉన్నాయని గ్రూప్-1 పరీక్షలు ఏ విధంగా అయితే రద్దు చేశారో ఆ తప్పిదాలకు కారణమైనటువంటి టీఎస్పీఎస్సీ నీ రద్దుచేసి చేసి చైర్మన్ ,సెక్రటరీ

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిర్గతంగా క్షమాపణ చెప్పి రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఎటువంటి నైతిక బాధ్యత లేదని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సంజయ్, నగర సంయుక్త కార్యదర్శి చరణ్, రాకేశ్, ప్రశాంత్,అభి, మహేష్, ప్రణీత్ మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *