297 Views
ముస్తాబాద్, సెప్టెంబర్27. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ 109.వ జయంతోత్సవం తెలంగాణతల్లి కూడలిలో బాపూజీ నిలువెత్తు చిత్రపటానికి పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు గూడూర్ భరత్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి పుష్పాంజలి ఘట్టించారు. ఈకార్యక్రమంలో గూడూర్ భరత్, సర్పంచ్ గాండ్ల సుమతి, డైరెక్టర్ అంజిరెడ్డి, సురేందర్ రావు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ సాధనలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ చేసిన కృషి, నిస్వార్థ సేవలను వారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తడుక బాలకిషన్, కొమ్ము బాలయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, గౌడమల్లేశం, వజ్రానందం,

పద్మశాల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found