రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు.
హైదరాబాద్ సెప్టెంబర్ 23:
రాష్ట్రంలో పనిచేస్తున్న తొమ్మిది మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న సందర్భంలో డీఎస్పీల బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది.
రానున్న రెండు మూడు రోజుల్లో మరికొన్ని బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం ఈనెల చివరిలోగా పోలీస్ మరియు రెవెన్యూ శాఖల్లో కొన్ని బదిలీలు జరగనున్నట్లు తెలిసింది.
