షాదుల్ల పర్శరాములు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్
సెప్టెంబర్ 18
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన షాదుల్ల పర్శరాములు( 30) మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ అవసరాల ఖర్చుల కొరకు 5000 రూపాయల నగదు సహాయాన్ని అందజేశారు.వారితోపాటుగా మాజీ యూత్ మండల అధ్యక్షులు కర్ణాకర్ మేకల శ్రీనివాస్ వార్డు సభ్యులు గణేష్ చెక్కలి నర్సింలు రమేష్ తదితరులు ఉన్నారు





