Breaking News

బస్సును దొంగలించిన వ్యక్తి అరెస్టు

105 Views

ఆర్టీసీ బస్సును దొంగలించిన వ్యక్తి అరెస్టు

 

సెప్టెంబర్ 12_సిద్దిపేట జిల్లా: ఆర్టీసీ బస్సును అపహరించి యాధావిధిగా బస్సును నడిపి ప్రయాణికుల నుంచి డబ్బును కొల్లగొట్టాలని చూసిన దొంగకు అత్యాశే మిగిలింది. ఈ ఘటన సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగు చూసింది._

_సీఐ కృష్ణారెడ్డి వెల్ల‌డించిన వివరాల ప్రకారం.. సిద్దిపేట ఆర్టీసీ డిపోలో స్వామి అనే వ్యక్తి అద్దె బస్సును నడుపుతున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి ఆర్టీసీ డిపో ముందున్న‌ రోడ్డుపైన బస్సును డ్రైవర్‌ నిలిపి వెళ్లాడు._

_అయితే బస్సు డ్రైవర్‌ బస్సు తాళాలు మ‌రిచాడు. ఇదే అదునుగా భావించిన దుండగుడు రాజు బస్సును అపహరించుకెళ్లాడు._

_ఇక సిరిసిల్ల నుంచి జేబీఎస్‌ బోర్డును తగిలించి బస్సును నడిపించాలని రాజు ప్లాన్ చేశాడు. ప్రయాణికులను ఎక్కించుకున్నాడు.. కాని టికెట్లు మాత్రం ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులకు అనుమానం వచ్చి రాజును నిలదీశారు._

_అదే సమయంలో బస్సులో డీజిల్‌ అయిపోవడంతో రాజు బస్సును అక్కడే వదిలి పారిపోయాడు. ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల‌కు సమాచారం అందించగా.. బస్సు యజమానికి సమాచారం ఇచ్చారు._

_బాధితుడు స్వామి ఫిర్యాదు మేరకు కేసు మోదు చేశామని సీఐ వివరించారు. బస్సు అపహరించింది సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్‌కు చెందిన బందెల రాజుగా గుర్తించి అతని అదుపులోకి తీసుకొని జ్యూడిషియల్‌ కస్టడీకి తరలించామన్నారు…!!_

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *