(కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సెప్టెంబర్ 11)
తిమ్మాపూర్ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ వనిత-దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో రవీందర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన తిమ్మాపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ…
తిమ్మాపూర్ మండలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అభివృద్ది పనులపై ప్రజాప్రతినిధులతో, అధికారులతో చర్చించారు.
అనంతరం జాతీయస్థాయిలో తిమ్మాపూర్ మండలం ఎంపిక కావడంతో ఆయా గ్రామాల సర్పంచులకు,ఎంపిటిసిలకు 15 లక్షల చొప్పున ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ తహసీల్దారు కనకయ్య, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.





