రంగారెడ్డి జిల్లాలో దారుణం…
ఎల్బీనగర్ పరిధిలో యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి
ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడిన శివకుమార్ అనే యువకుడు.. ఇంట్లో ఉన్న యువతి, ఆమె తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తమ్ముడు మృతి చెందగా.. ఆమెకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు
నిందితుడిని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శివకుమార్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. యువతిపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.





